టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు రోహిత్ శర్మ. హాయిగా ఇంట్లో టీవీ చూస్తూ సేదతీరుతూ ఉన్నాడు. అంతే కాకుండా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదండోయ్ వీలు దొరికితే గల్లీ క్రికెట్ ఆడుతూ ఉత్సాహం కూడా పొందుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. ఒక్కసారి మైదానంలోకి దిగాడు అంటే సృష్టించిన విధ్వంసం నుంచి అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అదరగొడతాడు అని చెప్పాలి.


 జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ అంటాడు. అయితే మైదానంలో బౌలర్లకు సింహ స్వప్నంలా మారిపోయే రోహిత్ శర్మ ఇప్పుడు హాలిడేస్ టైం లో మాత్రం గల్లీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవలే గల్లీ క్రికెట్ ఆడుతూ భారీ షాట్లు కొట్టి అలరించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియాలో కోహ్లీ రోహిత్ శర్మ బుమ్రా లాంటి ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. ఇక ఈ సీనియర్లు నేరుగా ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరబోతున్నారూ అన్న విషయం తెలిసిందే.


 అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ ఫామ్ పై అటు అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ లో అతను సరిగ్గా రాణించ లేక పోయాడు. 14 మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ 120 స్ట్రైక్ రేట్ తో 268 పరుగులు మాత్రమే చేశాడు అని చెప్పాలి. రోహిత్ శర్మ నాయకత్వం వహించిన ముంబై ఇండియన్స్ సైతం పేలవా ప్రదర్శన తో టోర్నీ ముగించింది. ఇప్పుడు ఇండియా  తరపున రోహిత్ శర్మ ప్రదర్శన ఎలా ఉండ బోతుంది అనేది ఆసక్తికరం గా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: