అనుష్క శర్మ విరాట్ కోహ్లీ త్వరలో అభిమానులందరికీ కూడా సర్ ప్రైస్ ఇచ్చి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారూ అంటూ సారాంశం ఉన్న వార్త వైరల్ గా మారిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత విరాట్ కోహ్లీకి బిసిసిఐ విశ్రాంతిని ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. టీమ్ ఇండియా సౌత్ఆఫ్రికా తో ఆడబోయే టి20 సిరీస్ కు అతని సెలెక్ట్ చేయలేదు. ఈ క్రమంలోనే హాలిడే ట్రిప్ ను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ. సతీమణి అనుష్క కూతురు వామిక తో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్లి పోయాడు.
ఇక మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఈ జంట ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరించారు. ఇక ఇటీవలే ఇండియాలో అడుగుపెట్టిన విరుష్క జంట ముంబైలోని కోకిలబెన్ అంబానీ హాస్పిటల్ వద్ద కనిపించడం మాత్రం చర్చనీయాంశంగా మారిపోయింది. హాస్పిటల్ నుంచి రేంజ్ రోవర్ కార్ లో వీరు బయటకు రావడాన్ని ఒకరు వీడియో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో తెగ చక్కెర్లు కొడుతుంది. ఇంతకీ వీరు ఎందుకు హాస్పిటల్కి వెళ్లారు అన్నది తెలియటం లేదు. అయితే కొంత మంది మాత్రం అనుష్క ప్రెగ్నెంట్ అని విరుష్క జంట మరికొన్ని రోజుల్లో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.