ఒకవైపు యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ ఆడుతోంది. ఇక ఈ టి 20 సిరీస్ పోరు ఎంతో రసవత్తరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే మరోవైపు జట్టు సీనియర్ ఆటగాడు తో కూడిన టీమ్ ఇండియా జట్టు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడేందుకు బయలుదేరింది అన్న విషయం తెలిసిందే. కాగా వైరస్ కారణంగా గత ఏడాది వాయిదా పడిన భారత్ ఇంగ్లాండ్ల మధ్య ఐదో టెస్టు సిరీస్ తాత్కాలికంగా రద్దయింది. ఇక ఈ మ్యాచ్ ను ప్రస్తుతం జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆడ బోతుంది టీమిండియా. బర్మింగ్హామ్ వేదికగా జరగబోతుంది ఈ టెస్ట్ మ్యాచ్.


 ఇక ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేకమైన విమానంలో ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టారు అన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే బిసిసిఐ ఒక ఫోటో కూడా పోస్ట్ చేసింది. అయితే ఇందులో రోహిత్ శర్మ కనబడకపోవడం గమనార్హం. దీంతో రోహిత్ శర్మ కు గాయం అయిందని ఫిట్నెస్ సమస్యలతో బాధ పడుతున్నాడు అంటూ ఎన్నో వార్తలు కూడా తెర మీదికి వచ్చాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. దీంతో రోహిత్ శర్మ లేకపోవడం ఏంటి ఎటు పోయాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం మొదలు పెట్టారు అభిమానులు.



 అయితే రోహిత్ శర్మ ఫిట్ గా ఉన్నాడని.. నెట్టింట్లో వైరల్ గా మారిపోతున్న వార్తల్లో నిజం లేదు అని బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఐదవ టెస్ట్ కు తప్పకుండా రోహిత్ శర్మ కెప్టెన్ గా బరిలోకి దిగుతాడని ఈనెల 20వ తేదీన మిగతా ఆటగాళ్లతో కలిసి ఇంగ్లండ్కు రోహిత్ శర్మ వెళ్ళపోతున్నాడు అని తెలుస్తోంది. అయితే ఇటీవలే హాలిడే నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్ళిన రోహిత్ శర్మ కాస్త ఆలస్యంగానే జట్టుతో కలవబోతున్నాడట. అయితే గత ఏడాది జరిగిన ఈ టెస్ట్ సిరీస్లో నాలుగో టెస్టులలో రోహిత్ శర్మ 368 పరుగులు చేశాడు.. ఇక ఇప్పుడు ఎలా రాణించ బోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: