కానీ యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించి వరుసగా రెండు మ్యాచ్లలో విజయం అందించాడు అజింక్య రహానే. అయితే సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్ కు ముందు హైడ్రామా నడిచింది అన్న విషయం తెలిసిందే. కొంతమంది భారత ఆటగాళ్లు బయో బబుల్ నుండి బయటకి వెళ్ళిన వీడియోలు ఫొటోలు వైరల్ గా మారడంతో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. కానీ సదరు ఆటగాళ్లకు నెగిటివ్ అని తేలడంతో చివరికి ఇండియా తో కలిసి ఆడనిచ్చారు. ఇదే విషయంపై అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ ఫైన్ స్పందించాడు.
నలుగురు ఐదుగురు భారత ఆటగాళ్లు ఏకంగా బయో బబుల్ చేసి బయటకు వెళ్లి సిరీస్ ను రిస్క్ లో పెట్టారు. ఇండియన్ ప్లేయర్లు దేని కోసం బయటికి వెళ్లారు తెలియదు గానీ.. నిజాయితీగ వ్యవహరించి ఉంటే బాగుండేది అంటూ వ్యాఖ్యానించాడు టీమ్ ఫైన్. ఇక ఇదే విషయంపై మాట్లాడుతూ భారత క్రికెట్ ప్లేయర్స్ వ్యవహరించిన తీరు తమ జట్టులోని ఆటగాళ్లకు చాలామందికి నచ్చలేదు. ఎందుకంటే ఎంతోమంది క్రిస్మస్ వేడుకలను ఫామిలీ తో జరుపుకో కుండా కేవలం బయో బబుల్ కీ మాత్రమే పరిమితం అయితే భారత ఆటగాళ్లు మాత్రం ఇలా బయటికి వెళ్లడం చిరాకు తెప్పించింది అంటూ వ్యాఖ్యానించాడు.