దేశవాళీ టోర్నీకి ఎంపిక చేయలేదు అనే కారణంతో చివరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పాకిస్తాన్లో వెలుగులోకి వచ్చింది. షోయబ్ అనే ఫస్ట్ క్లాస్ క్రికెటర్ సింధు ప్రావిన్స్ లోని హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంటర్సిటీ ఛాంపియన్షిప్ ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ కి ఆదేశించింది.. ఈ క్రమంలోనే ఇక కోచ్ సలహా మేరకు ట్రయల్స్ నిర్వహించి జట్టులోకి ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే షోయబ్ ను కనీసం బౌలింగ్ ట్రయల్స్ కి కూడా తీసుకోలేదు. దీంతో అతని పేరు హైదరాబాద్ జట్టులో లేకుండా పోయింది.
ఇదే విషయంపై ఎంతగానో మనస్తాపం చెందిన సదరు యువకుడు ఇంట్లో రూమ్లో కి వెళ్లి తలుపులు వేసుకుని ఉండిపోయాడు. ఎంతకీ బయటకి రాకపొయేసరికి తల్లిదండ్రులు గమనించగా షోయబ్ తన చేతిని బ్లేడుతో పలుమార్లు కోసుకున్నాడు అని తెలిసింది. ఈ క్రమంలోనే అపస్మారకస్థితిలో పడివున్న షోయబ్ కు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే కోచ్ లు బౌలింగ్ ట్రయల్స్ కి తీసుకెళ్ల లేదని దీంతో జట్టుకు ఎంపిక కాలేకపోయాను అనే బాధతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయాడు అని అందుకే ఆత్మహత్యాయత్నం చేశాడు అంటూ అతని తల్లిదండ్రులు చెప్పారు.