ఇక్కడ ఐర్లాండ్ పర్యటనలో ఇండియా 2 టీ 20 లు ఆడనుంది... ఈ టీమ్ కు ఐపిఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను ముందుండి నడిపించి మొదటి సీజన్ లోనే టైటిల్ ను అందించిన హార్దిక పాండ్య ను బీసీసీఐ కెప్టెన్ గా నియమించింది. ప్రస్తుతం ఐర్లాండ్ తో పోటీ పడనున్న జట్టులో ఐపిఎల్ లో రాణించిన రాహుల్ త్రిపాఠి, దీపక్ హూడ, సంజు శాంసన్, దినేష్ కార్తిక్, అవేష్ ఖాన్, ఆర్ష్ దీప్ సింగ్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. అయితే అంది వచ్చిన అవకాశాన్ని వీళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటారు అన్నది రేపు మ్యాచ్ జరిగిన తర్వాత మాత్రమే తెలుస్తుంది.
అయితే పసికూన ఐర్లాండ్ తో హార్దిక పాండ్య ఏ విధంగా జట్టును విజయపథంలో నడిపిస్తాడు అన్నది చూడాలి. పసికూన కదా అని లైట్ గా తీసుకుంటే ... సంచలనాలు నమోదు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఐర్లాండ్ తో రేపు జరగనున్న మొదటి టీ 20 లో ఎవరు విజయాన్ని సాధిస్తారు అన్నది చూద్దాం.