కానీ అతనికి క్రికెట్ లోకి రీఎంట్రీ అస్సలు కలిసి రాలేదు అన్న విధంగానే కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఆ తర్వాత రనౌట్ రూపంలో వికెట్ కోల్పోవడం గమనార్హం. దీంతో ఆ తర్వాత రోజుల్లో అతనికి అవకాశాలు దక్కుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే మురళీ విజయ్ ఇంతకుముందు 2020లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం పొట్టి క్రికెట్ కు పూర్తిగా దూరం అయిపోయాడు.
ఈ క్రమంలోనే ఇన్నాళ్లు విరామం తీసుకోవడం పై మాట్లాడిన మురళి విజయ్.. తనకు చాలా కాలం పాటు క్రికెట్ ఆడాలని ఉందని.. కేవలం వ్యక్తిగత విరామం తీసుకున్నాను అంటూ తెలిపాడు. నాకు కుటుంబం ఉంది.వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి నేను ఇప్పుడు నా క్రికెట్ను ఆస్వాదిస్తున్నాను ఇక ఫిట్ గా కూడా ఉన్నాను. ఇక ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో రాణిస్తానని నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మురళి విజయ్ అంతర్జాతీయ రికార్డులు చూసుకుంటే.. 38 ఏళ్ల మురళీ విజయ్ 61 టెస్టు మ్యాచ్ లలో 3982 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు ఉన్నాయ్. టీమ్ ఇండియా తరఫున 17 వన్డేలు, 9 టీ20 మ్యాచ్లకు వహించాడు.