ప్రస్తుతం టీమిండియా మహిళలు జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతోంది స్మృతి మందన. అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో ఎప్పుడు ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. టీమిండియా మహిళల జట్టు లో ఎంతోమంది ప్లేయర్ లు ఉన్న అటు స్మృతి మందానాకు మాత్రం ఎందుకు సోషల్ మీడియాలో కాస్త ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కేవలం ఈమె ఆటకు మాత్రమే కాదు ఆమె అభినయానికి కూడా అభిమానులు అయిన వాళ్ళు చాలామంది అభిమానులు ఉన్నారు. చిరునవ్వుతోనే ఎంతో మంది యువత మనసులను కొల్లగొట్టింది స్మృతి మందాన.


 అందుకే సోషల్ మీడియాలో స్మృతి మందాన కు సంబంధించి ఏదైనా వార్త తెరమీదికి వచ్చిందంటే చాలు అది కేవలం నిమిషాల వ్యవధిలోనే వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా తన చిరునవ్వుతో ఎంతోమందిని ఆకర్షించిన స్మృతి మందాన తన బ్యాటింగ్తో కూడా ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. ఎప్పుడూ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ ఇండియాను విజయ్ తీరాల వైపు నడిపేందుకు ఎప్పుడూ ముందు ఉంటుంది స్మృతి మందన. ఈ క్రమంలోనే ఇటీవలే తన అద్భుతమైన బ్యాటింగ్తో టీ20 లో ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది ఈ స్టార్ క్రికెటర్.


 ఇటీవలే శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో 39 పరుగులు చేయడం ద్వారా టి20 ఫార్మాట్లో రెండు వేల పరుగుల మార్కును అధిగమించింది స్మృతి మందాన. అయితే స్మృతి మందాన ఇలా రెండు వేల పరుగులు సాధించడానికి 84 ఇన్నింగ్స్ ల  సమయం పట్టడం గమనార్హం. దీంతో అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది. భారత జట్టు తరఫున టి 20 లలో రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదవ క్రికెటర్ గా నిలిచింది. ఇక ఇప్పటికే ఈ లిస్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హర్మన్ ప్రీత్ కౌర్, మిథాలీ రాజ్ లు మాత్రమే టి20 లలో 2000 పరుగుల మార్కును అందుకున్నా క్రికెటర్ లుగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: