మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ తీసుకున్నాడు. మరి ఇండియా ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపైన మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించాలి అన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఇండియా పాలు మార్పులను చేసింది.. అందులో భాగంగా ఈ రోజు ఋతురాజ్ ప్లేస్ లో శాంసన్ మ్యాచ్ ఆడనున్నాడు... ఇక అవేశ్ ఖాన్ మరియు చాహల్ ల స్థానంలో హర్షల్ మరియు బిష్ణోయ్ లు బరిలోకి దిగుతున్నారు. మరి ఈ రోజు ఎవరు మ్యాచ్ ను గెలవనున్నారు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
అయితే ఐర్లాండ్ జట్టు సంచలనాలకు మారుపేరు అని తెలిసిన విషయమే. కానీ వీరికి బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడుతోంది. కానీ బ్యాటింగ్ లో కాస్త తడబడుతోంది.. ముఖ్యంగా స్టిర్లింగ్ కాసేపు క్రీజులో ఉంటే పరుగులు వాటంతట అవే వస్తాయి కానీ అనవసరంగా తొందరపడి వికెట్ ను పోగొట్టుకుంటున్నాడు... మరి ఈ రోజు అయినా అంచనాలకు మించి రాణిస్తాడా లేదా అన్నది చూడాలి.