ఈ దశలోనే పంత్ కెరీర్ లో పడవ అర్ద సెంచరీ చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో నేనున్నా అంటూ వచ్చి ఇంగ్లాండ్ బౌలర్లకు అడ్డంగా నిలబడి పోయాడు. ఇతనికి అల్ రౌండర్ జడేజా నుండి చక్కని సహకారం లభించింది. సీనియర్లు విఫలమైన పిచ్ మీద పంత్ బ్యాటింగ్ చూసి అందరూ అవాక్కయ్యేలా కౌంటర్ అటాకింగ్ తో ఆడాడు. ఇంతకు ముందు స్వదేశంలో సౌత్ ఆఫ్రికా తో పేలవమైన ఆటతీరును కనబరిచిన పంత్ ఈ టెస్ట్ లో మాత్రం అద్భుతంగా ఆడాడు. పంత్ ఇదే జోరు కనుక చూపిస్తే మొదటి రోజే సెంచరీ చేసినా షాక్ అవ్వాల్సిన పనిలేదు.
ప్రస్తుతం ఇండియా 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. వీరిద్దరూ ఈ రోజు మొత్తం ఆడితే ఖచ్చితంగా పరుగులు చేస్తుంది. ఇక ఇండియాను ఆండర్సన్ 3 వికెట్లు, పాట్స్ రెండు వికెట్లు తీసి దెబ్బ కొట్టారు. మరి ఆఖరి సెషన్ లో ఏ విధంగా ఆడుతారు అన్నది చూడాలి ..