ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తేచాలు మహేంద్రసింగ్ ధోని పోస్టర్ల ఎక్కువగా కనిపిస్తున్నాయ్. ఇక ఏ వాట్సాప్ స్టేటస్  చూసిన ధోనికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. దీనికంతటికీ కారణం నేడు భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోని పుట్టినరోజు కావడమే. నేడు మహేంద్ర సింగ్ ధోనీ 41 వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో అభిమానులు పలువురు క్రికెటర్లు సైతం అటు సోషల్ మీడియా వేదికగా ధోని కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. తమ ఫేవరెట్ క్రికెటర్ బర్త్ డే  మరింత ప్రత్యేకంగా ఉండాలని భావిస్తూ అభిమానులు అందరూ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 అదే సమయంలో ఈరోజు బర్త్ డే బాయ్ అయినా మహేంద్రసింగ్ ధోని తన పుట్టిన రోజునాడు ఎక్కడ ఉన్నాడు ఎలా పుట్టిన రోజునీ ఎంజాయ్ చేస్తున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే వేర్ ఇస్ మహేంద్ర సింగ్ ధోనీ అంటూ గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు ఎంతోమంది అభిమానులు. ఈ క్రమంలోనే ఇటీవల ధోని ఎక్కడున్నాడు అనే వార్త వైరల్ గా మారి పోయింది. ప్రస్తుతం మహేంద్రుడు తన స్నేహితులతో కలిసి లండన్ లో వింబుల్డన్ మ్యాచ్ ను వీక్షిస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇక దిగ్గజ క్రికెటర్ వచ్చి వింబుల్డన్  మ్యాచ్ వీక్షిస్తూ ఉంటే వింబుల్డన్ నిర్వాహకులు ఊరుకుంటారా ఫోటో తీసి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

 ధోని ఎక్కడికి వెళ్ళినా అప్డేట్ ఇచ్చే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఇక ఇప్పుడు ధోని పుట్టినరోజు నాడు వింబుల్డన్ మ్యాచ్ వీక్షిస్తూ ఉండటాన్ని కూడా తమ సోషల్ మీడియాలో వెల్లడించింది.లండన్ లోనే బర్త్ డే బాయ్ ధోని ఉన్నాడు అంటూ ఒక క్యాప్షన్  కూడా ఇచ్చింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్వీట్ కాస్త వైరల్ గా మారిపోయింది. అయితే లండన్లోనే అటు మహేంద్ర సింగ్ ధోనీతో  సతీమణి సాక్షి కేక్ కట్ చేయించిన వీడియోను కూడా అభిమానులను ఆకట్టుకుంటుందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: