టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని కి మిగతా క్రికెటర్ లతో పోల్చి చూస్తే కాస్త ఎక్కువగానే క్రేజ్ వుంది అని చెప్పాలి. ఎంతలా అంటే ఒక్కసారి ధోనీ మైదానంలో కనిపించాడు అంటే చాలు ప్రేక్షకులు అందరూ కూడా మైమరచిపోతూ ఉంటారు. భారత క్రికెట్లో ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో దేశం నలుమూలలలో ఉన్న అభిమానులు అందరూ కూడా తమ ప్రాంతీయ జట్టు కంటే ధోని సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఆదరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆయన అభిమానులు స్టేడియంలో ఎలా హోరెత్తి పోతూ ఉంటారో ఇప్పటికి ఎన్నో సార్లు చూసాము అని చెప్పాలి. అయితే ఇటీవలే ధోనీ తన 41వ పుట్టినరోజు జరుపుకున్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఎంతో మంది అభిమానులు తమకు నచ్చిన విధంగా వినూత్నంగా ఇక తమ అభిమాన క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. బెజవాడ అభిమానులు ఏకంగా నలభై ఒక్క అడుగుల భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇక్కడ ఒక అభిమాని మరింత కొత్తగా బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు అని తెలుస్తోంది.



 కడలూరు జిల్లా రామనత్తం ఆరం గూరు గ్రామానికి చెందిన గోపికృష్ణ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఇతను ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమాని. గతంలోనే తన ఇంటిని చెన్నై సూపర్ కింగ్స్ కలర్ పసుపు రంగు కలర్ వేయించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇంటి పై మహేంద్ర సింగ్ ధోనీ బొమ్మ కూడా వేయించాడు. ఇటీవల ధోని 41 వ పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ ప్రత్యేకతను చాటుకున్నాడు. పసుపు రంగులో ఉన్న ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి ద్విచక్ర వాహనం నెంబర్ కూడా ధోనీ జెర్సీ నెంబర్ 7 కలిసి వచ్చేలా 777 పెట్టుకున్నాడు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: