ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతూ ఉంటే ఇక్కడ కొంతమంది మాత్రం ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయ్ అని నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే  జ్యోతిష్యులు చెప్పింది విని చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం.. బురిడి బాబాల  మాయ మాటలు విని దారుణాలకు పాల్పడటం  చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే..  ఇలా మంత్రాలకు చింతకాయలు రాలతాయ్ అని నమ్ముతూ ఉన్మాదులు గా  మారిపోతున్న మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు అని చెప్పాలి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. జ్యోతిష్యుడు దోషం ఉంది అని చెప్పిన విషయాన్ని మనసులో పెట్టుకుని ఒక వ్యక్తి చివరికి మరో వ్యక్తిని దారుణంగా హతమార్చాడు.

 ఈ దారుణమైన ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా కావలి చెందిన గడ్డం బాబు కుటుంబంతో సహా విజయవాడ లోకి వచ్చి స్థిరపడ్డారు. సీతారాంపురం కొత్త వంతెన సెంటర్ వద్ద అద్దె ఇంట్లో బాబు కుటుంబం నివాసం ఉంటుంది. అదే ప్రాంతంలో వేరే గ్రహంలో రత్నాల తంబీ కూడా ఉంటుంది. కొత్త వంతెన వద్ద జామకాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు గడ్డం తంబీ.. బాబు పెయింటర్ గా పనిచేస్తుంటాడు. అయితే సొంతంగా వాహనం లేకపోవడంతో ఇక ఎంతగానో ఇబ్బందులు పడుతున్నాడు బాబు.


 ఈ క్రమంలోనే   ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయేలా పరిష్కారం చూపించాలి అంటూ తంబీనీ కోరాడు బాబు. అయితే అదే పోర్షన్ లో నివాసముంటున్న జ్యోతిష్యుడు దగ్గరకి వీరు వెళ్లగా గడ్డం బాబు జాతకంలో దోషం ఉందని.. ఆయన త్వరలో చనిపోతాడని అతని భార్య రెండో వివాహం చేసుకుందని జ్యోతిష్కుడు చెప్పాడు. తర్వాత  అక్కడి నుంచి వీరిద్దరూ వచ్చేసారు. అయితే జ్యోతిష్యుడు చెప్పిన మాటలను తంబీ ఆ ప్రాంతంలోని ప్రజలకు బంధువులకు చెప్పి తన పరువు పోగొట్టుకున్నాడు అని పగ పెంచుకున్నాడు  బాబు. చివరికి ఇటీవలే మద్యం సేవించిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో తంబీపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ క్రమంలోనే తండ్రి మృతి చెందగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: