అలాంటి విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు కెరీర్లో ఎప్పుడూ చూడనంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత కొంత కాలం నుంచి సరైన ఫామ్ లో లేక తెగ ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. ఒకప్పుడు వరుస సెంచరీలు కొట్టిన కోహ్లీ ఇక ఇప్పుడు సెంచరీ చేయగా మూడేళ్లు గడిచిపోతున్నాయి. బీసీసీఐ అతనికి ఎంతలా అవకాశాలు ఇచ్చినప్పటికీ మళ్లీ మునుపటి ఫామ్ అందుకోలేక పోతున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే అతనిపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కాగా కోహ్లీ పేలవ ఫామ్ పై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న విరాట్ కోహ్లీ మరో మూడు నెలలపాటు క్రికెట్ నుంచి విరామం తీసుకుంటే మంచిది అంటూ మైకెల్ వాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 20 ఏళ్ల కెరీర్లో కుటుంబంతో మిస్సయిన అనుభూతులను ఆస్వాదించాలని.. బీచ్ ల వద్ద హాయిగా సేద తీరాలి అంటూ సూచించాడు. స్వల్ప వ్యవధిలో మూడు ఫార్మాట్లకు ఆడటం ఏ ఆటగాడైనా అసాధ్యం అంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తరఫున ఆడుతున్న కోహ్లీ వెస్టిండీస్ పర్యటనకు మాత్రం సెలెక్టర్ లను విశ్రాంతి కావాలని కోరినట్లు తెలుస్తోంది.