ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా రిషబ్ పంత్ పేరు మారుమోగి పోయింది అన్న విషయం తెలిసిందే. టీమిండియా కష్టాల్లో ఉన్న రెండుసార్లు జట్టు ఆదుకోవడమే కాదు సూపర్ సెంచరీతో చెలరేగిన పోయాడు రిషబ్ పంత్. ఇక ఇటీవలే నిర్ణయాత్మకమైన మూడో వన్డే మ్యాచ్లో కూడా 72 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను ఆదుకున్నాడు. 113 బంతుల్లో 125 పరుగులు చేసి అజేయంగా సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈక్రమంలోనే రిషబ్ పంత్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది అనే విషయం తెలిసిందే.


 అయితే ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో బిజీబిజీగా గడిపి అదిరిపోయే ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న రిషబ్ పంత్ కు విండీస్తో వన్డే సిరీస్కు విశ్రాంతి ఇచ్చింది బీసీసీఐ. అయితే వన్డే సిరీస్ కి విశ్రాంతి తీసుకున్నా టి20 సిరీస్ కు మాత్రం  అందుబాటులోకి రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ఖాళీ సమయం దొరకడంతో సోషల్ మీడియాలో వాలిపోయాడు రిషబ్ పంత్. ఈ క్రమంలోనే ఎంతో ఫేమస్ అయిన వెబ్ సిరీస్ మిర్జాపూర్ డైలాగ్ ని క్యాప్షన్ గా పెట్టి కుర్చీ పక్కన దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కొత్త నిబంధన తీసుకొస్తున్నాం.. మీర్జాపూర్  సింహాసనంపై ఎవరు కూర్చుంటారు.. వారు పాలనను మార్చవచ్చు.. మున్నా భయ్యా అంటూ కామెంట్ జోడించాడు రిషబ్ పంత్.



 ఈ క్రమంలోనే  మిర్జాపూర్ వెబ్ సిరీస్ లో మున్నాభాయ్ పాత్రను పోషించి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నా నటుడు దివ్యందు  సరదాగా స్పందించాడు. మీకు అర్హత ఉంది అంటూ రిషబ్ పంత్ ట్విట్ కు రీట్వీట్  చేశాడు. ఇక దివ్యందు పెట్టిన పోస్ట్ కి పంత్ సమాధానం ఇస్తూ.. హహహ లేదు మున్నా భయ్యా ఇది మీ సింహాసనమే అంటూ సమాధానం చెప్పగా... మీరు ఇలాగే ఎదగాలి బ్రదర్ అంటూ నటుడు దివ్యందు ఆకాంక్షిస్తూ రిట్వీట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: