తప్పు చేస్తే ఎన్నటికైనా ప్రాయశ్చిత్తం వహించాల్సిందే అని చెబుతూ ఉంటారు పెద్దలు. కొన్ని కొన్ని సార్లు కొన్ని ఘటనలు చూసినప్పుడు ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు భారత జట్టులో దినేష్ కార్తీక్, మురళీ విజయ్ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రాణ స్నేహితులు గా ఉండే వీరి స్నేహ బంధాన్ని చూసి క్రికెట్ ప్రేక్షకులు కూడా మురిసిపోయేవారు. ఇలాంటి సమయంలో మురళి ఒక నీచమైన బుద్ధుని బయట పెట్టాడు అన్న విషయం తెలిసిందే.. ప్రాణస్నేహితుడు దినేష్ కార్తీక్ పట్ల నమ్మకం గా ఉండాల్సింది పోయి.. అతని భార్యతో అక్రమ సంబంధానికి తెరలేపాడు..


 చివరికి ఓ రోజు ఈ అక్రమ సంబంధానికి సంబంధించిన విషయం దినేష్ కార్తిక్ కి తెలిసింది. ఇక ప్రాణస్నేహితుడు ఇలా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని వెన్నుపోటు పొడవడంతో తట్టుకోలేకపోయాడు. డిప్రెషన్లో మునిగి పోయాడు. భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత ఎక్కడ వెనకడుగు వేయని మురళీ విజయ్ కార్తీక్ భార్యను పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక అప్పుడు చేసిన తప్పుకు ఇక ఇప్పుడు మురళీ విజయ్ ప్రాయశ్చిత్తం వహిస్తున్నాడు అన్నది తెలుస్తుంది.. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా రూబీ ట్రిచి వారియర్స్ తరపున ఆడుతున్నాడు  మురళీ విజయ్.


 అయితే ఇటీవలే మ్యాచ్ జరుగుతున్న సమయంలో మురళీ విజయ్ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో ఇక ప్రేక్షకులందరూ డీకే డీకే అంటూ అరవడంతో మురళీ విజయ్ ప్రేక్షకులకు దండం పెట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇక కాసేపటి వరకూ అలాగే ఓపికతో చూసిన మురళీ విజయ్ చివరికి ఆగ్రహంతో ఊగిపోయాడు. బౌండరీ లైన్ దాటుకొని వచ్చి ప్రేక్షకులతో గొడవకు దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే స్టేడియంలో ప్రేక్షకులు సైతం అతని మీద ఒక్కసారిగా ఎదురు తిరగడంతో వెంటనే వెనక్కి అడుగు వేసి మళ్లీ మైదానంలోకి వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక మురళీ విజయ్ కు ఇది నిజంగాఒక పెద్ద అవమానం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: