ఇక టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. టీ20ల్లో ఇన్నింగ్స్‌ తొలి బంతికే డకౌటైన రెండో భారత్‌ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.సెయింట్స్‌ కిట్స్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగిన రోహిత్‌ శర్మ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక అంతకుముందు భారత యువ ఆటగాడు పృథ్వీ షా శ్రీలంకపై తొలి బంతికే డకౌట్‌ అయ్యి ఈ చెత్త రికార్డు సాధించాడు.అయితే రోహిత్‌ శర్మ టీ20ల్లో గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగడం ఇది 8వసారి. అదే విధంగా టీ20ల్లో గోల్డన్‌ డకౌట్‌ అయిన రెండో భారత కెప్టెన్‌గా కూడా రోహిత్‌ శర్మ నిలిచాడు.అంతకుమందు శ్రీలంక సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా గోల్డన్‌ డకౌట్‌ అయ్యాడు.


ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఇండియాపై వెస్టిండీస్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా 19.2 ఓవర్లలో మొత్తం 138 పరుగులకు ఆలౌటైంది.ఇక విండీస్‌ పేసర్‌ ఒబెడ్‌ మెక్‌కాయ్‌ 6 వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించాడు. అతడితో పాటు హోల్డర్‌ రెండు వికెట్లు, జోసఫ్‌ ఇంకా హోసెన్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక భారత బ్యాటర్లలో హార్ధిక్‌ పాండ్యా మొత్తం 31 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 139 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ ఓన్లీ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్‌ బ్యాటర్లలో బ్రాండన్‌ కింగ్‌(68) ఇంకా అలాగే థామస్‌(31) పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో జడేజా, హార్దిక్‌ పాండ్యా, అవేష్‌ ఖాన్‌, అర్షదీప్‌ సింగ్‌ ఇంకా అశ్విన్‌ తలా వికెట్‌ సాధించారు. ఇరుజట్ల మధ్య మూడో టి20 మంగళవారం నాడు (ఆగస్టు 2న) జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: