దాయాదుల సమరానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే   ఉత్కంఠ భరితమైన పోరును చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే నేడు దుబాయ్ లోని అంతర్జాతీయ స్టేడియం వేదికగా తాడోపేడో తేల్చుకోవడానికి పాకిస్తాన్ భారత్ జట్లు సిద్ధమయ్యాయి. ఇక ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ కీ ముందు ఐసీసీ క్రికెట్ అకాడమీ లో ఇరు జట్లు కూడా ప్రాక్టీస్ లో తీవ్రంగా  చెమటోడుస్తున్నాయి అని చెప్పాలి. అయితే సాధారణంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చాలు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఫీలవుతూ ఉంటారు.  భారత క్రికెట్ ప్రేక్షకులు పాకిస్తాన్ ఆటగాళ్ళ శత్రువులు గానే చూస్తూ ఉంటారు.


 కానీ అటు టీమ్ ఇండియా లోని ఆటగాళ్లు మాత్రం క్రీడాస్ఫూర్తిని చాటుతూ పాకిస్తాన్ ఆటగాళ్ళ తో ఎంతో సరదాగా ముచ్చటించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే  ఇక ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా భారత్ పాకిస్థాన్ ఆటగాళ్లు పరస్పరం ఒకరిని ఒకరు ఎంతో ప్రేమగా పలకరించుకోవడానికి సంబంధించిన వీడియోలు గత కొన్ని రోజుల నుంచి వైరల్ గా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇది చూసిన ఇరుదేశాల అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పాలి.



 ఇటీవలే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే వీరిద్దరు కూడా ఒకరికి ఒకరు ఎంతో ఆప్యాయతతో పలకరించుకున్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో భాగంగా రోహిత్ శర్మ బాబార్ తో పెళ్లి చేసుకో అంటూ అడిగాడు. దానికి నవ్వుతూ సమాధానం చెప్పిన బాబర్ ఇప్పుడే వద్దు భయ్యా అంటూ బదులిచ్చాడు. అంతేకాకుండా క్రికెట్ కు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా ఈ ఇద్దరు కెప్టెన్లు చర్చించుకున్నారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: