కానీ అటు టీమ్ ఇండియా లోని ఆటగాళ్లు మాత్రం క్రీడాస్ఫూర్తిని చాటుతూ పాకిస్తాన్ ఆటగాళ్ళ తో ఎంతో సరదాగా ముచ్చటించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా భారత్ పాకిస్థాన్ ఆటగాళ్లు పరస్పరం ఒకరిని ఒకరు ఎంతో ప్రేమగా పలకరించుకోవడానికి సంబంధించిన వీడియోలు గత కొన్ని రోజుల నుంచి వైరల్ గా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇది చూసిన ఇరుదేశాల అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పాలి.
ఇటీవలే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే వీరిద్దరు కూడా ఒకరికి ఒకరు ఎంతో ఆప్యాయతతో పలకరించుకున్నారు. వీరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో భాగంగా రోహిత్ శర్మ బాబార్ తో పెళ్లి చేసుకో అంటూ అడిగాడు. దానికి నవ్వుతూ సమాధానం చెప్పిన బాబర్ ఇప్పుడే వద్దు భయ్యా అంటూ బదులిచ్చాడు. అంతేకాకుండా క్రికెట్ కు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా ఈ ఇద్దరు కెప్టెన్లు చర్చించుకున్నారు అనే చెప్పాలి.