భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ గురించి దాదాపు క్రికెట్ ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ మాజీ క్రికెటర్ ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్ గా కొనసాగుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఏదైనా మ్యాచ్ జరిగింది అంటే చాలు ఇక జట్టులోని ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు సంజయ్ మంజ్రేకర్. ఇక ఇటీవల భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా గెలిచిన ఇండియన్ ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసి పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు.


 ఇటీవలే దుబాయ్ వేదికగా జరిగిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా జట్టు విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా భారత జట్టుకు మరో విజయాన్ని అందించాడు.  మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా హార్దిక్ పాండ్యా కు మంచి మద్దతు ఇచ్చాడు అని చెప్పాలి. వరుసగా వికెట్లు కోల్పోయిన సమయంలో రవీంద్ర జడేజా టీమిండియా బ్యాటింగ్ విభాగాన్ని నిలబెట్టాడు.



 అయితే మ్యాచ్ అనంతరం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్ళాడు సంజయ్ మంజ్రేకర్. ఇక సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నకు ముందే జడ్డు నవ్వడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే మొదటి ప్రశ్న జడ్డు నువ్వు నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా అంటూ అడిగాడు. దానికి బదులుగా నవ్వుతూ.. అవును సిద్ధంగా ఉన్నాను అంటూ సమాధానం ఇచ్చాడు జడేజా. ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. కాగా గత కొంత కాలం నుంచి సంజయ్ మంజ్రేకర్ రవీంద్ర జడేజా మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. 2019 ప్రపంచ కప్ సమయంలో రవీంద్ర జడేజా అరకొర క్రికెటర్ అని వ్యాఖ్యానించాడు సంజయ్ మంజ్రేకర్. దీనిపై స్పందించిన జడెజా మీకంటే కొన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాను. ఇంకా ఆడుతూ ఉన్నాను మనుషులను గౌరవించడం నేర్చుకోండి అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: