ఇటీవలే ఆసియా కప్ లో భాగంగా టీమిండియా ఆడిన రెండు మ్యాచ్లలో కూడా అటు రవీంద్ర జడేజా మంచి ఇన్నింగ్స్ ఆడాడు అన్న విషయం తెలిసిందే. బౌలింగ్ లో పెద్దగా ఆకట్టుకోలేక పోయినా ఇప్పటికీ బ్యాటింగ్లో మాత్రం కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించాడు రవీంద్ర జడేజా. ఇక అలాంటి రవీంద్ర జడేజా ఇక ఇప్పుడు గాయం కారణంగా ఆసియాకప్ నుంచి వైదొలిగాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టు నుంచి తప్పుకున్న నేపథ్యంలో అతని స్థానంలో అక్షర్ పటేల్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు అనేది తెలుస్తుంది.
రవీంద్ర జడేజా మోకాలి గాయంతో బాధపడుతూ ఉన్నాడు. మిగతా మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండడు. బీసీసీఐ వైద్య బృందం ప్రస్తుతం అతని పర్యవేక్షిస్తుంది. అతని గాయం తీవ్రత ఎలా ఉంది అన్న విషయాన్ని పరీక్షిస్తుంది. ఈ క్రమంలోనే రవీంద్ర జడేజాకు ఆసియా కప్లో భాగంగా స్టాండ్బై గా ఎంపిక అయిన అక్షర్ పటేల్ అతని స్థానాన్ని భర్తీ చేస్తాడు. ఇక త్వరలోనే దుబాయ్ లో ఉన్న టీమిండియా జట్టులో అతను కలుస్తాడు అని బిసిసీఐ ఇటీవలే ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఇటీవలే ఆసియా కప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కష్టాలలో జట్టు ఉన్న సమయములో 35 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్లో ఆకట్టుకుని కీలకమైన వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి.