అదే సమయంలో ఇప్పుడు మరోసారి చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్తో మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు సిద్ధమవుతోంది. అయితే కోహ్లీ సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు అవబోతుంది అన్న విషయం తెలిసిందే. కోహ్లీ పరుగుల పరంగా సెంచరీ చేయలేక పోయినప్పటికీ మ్యాచ్ ల పరంగా ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వందవ మ్యాచ్ ఆడి సెంచరీ చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పరుగుల పరంగా సెంచరీ చేస్తాడో లేదో తెలియదు కానీ సిక్సర్ల పరంగా మాత్రం చేసేందుకు సిద్ధమయ్యాడు విరాట్ కోహ్లీ.
ఇప్పటికే ఎన్నో రికార్డులను అలవోకగా ఛేదించిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మరో అరుదైన మైలురాయిని అందుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే మరో మూడు సిక్సర్లు కొడితే టి20లో వంద సిక్సర్లు కొట్టిన రెండవ భారత బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించబోతున్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఈ జాబితాలో రోహిత్ శర్మ 165 సిక్సర్లతో తొలిస్థానంలో కొనసాగుతూ ఉండటం గమనార్హం. కాగా విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ టి20 కెరీర్లో ఇప్పటివరకు 97 సిక్సర్లు కొట్టాడు. మరో మూడు సిక్సర్లు కొట్టాడు అంటే టి-20లో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆటగాడిగా సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలుస్తాడు. పాకిస్థాన్తో నేడు జరగబోయే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎలా రాణించబోతున్నాడు అన్నది చూడాలి.