ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఇప్పటి వరకు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం ఒక జట్టు మాత్రమే కాదు అదొక బ్రాండ్ అన్నట్లుగా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ లో అడుగు పెట్టిన నాటి నుంచి ధోనీ కెప్టెన్సీ వహిస్తున్నాడు అని చెప్పాలి.  కానీ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం  చెన్నై సూపర్ కింగ్స్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది.  ధోని  వారసుడిగా పేరున రవీంద్ర జడేజాకు  కెప్టెన్సీ అప్పగించారు.  కానీ అతను కెప్టెన్ గా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఒత్తిడిని తట్టుకోలేక మళ్లీ ధోనీకి  కెప్టెన్సీ అప్పగించాడు.


 ఇక ఆ తర్వాత అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. లీగ్  దశలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ నుండి   నిష్క్రమించింది. అయితే వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కి ధోని  అందుబాటులో ఉంటాడా..  అసలు క్రికెట్ ఆడతాడా లేదా అన్నది కూడా అభిమానుల్లో నెలకొంది ప్రశ్న. ఈ క్రమంలోనే ధోని ఆడితే బాగుండని ఎంతోమంది అభిమానులు గట్టిగానే కోరుకునాట్టున్నారు.  ఎందుకంటే ఇది నిజం కాబోతుంది. మరోసారి ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ధోనీ వ్యవహరించాడు.  చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.


 చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ  కాశీవిశ్వనాథన్  ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి అని చెప్పాలి. ఈ విషయం తెలిసిన వారు మహేంద్రసింగ్ ధోని అభిమానులకు ఇంతకంటే గొప్ప శుభవార్త ఉంటుందా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కప్  కొట్టడం ఖాయం అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు  ఎంతోమంది అభిమానులు.  మరి ఈ ఏడాది పేలవ ప్రదర్శన నేపథ్యంలో వచ్చే ఏడాది  జట్టులో  ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్నది  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: