ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మన్గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగిన విరాట్ కోహ్లీ గత కొంతకాలం నుంచి మాత్రం ఫామ్ కోల్పోవడం కారణంగా ఇక ర్యాంక్ అంతకంతకు దిగజారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తక్కువ పరుగులు మాత్రమే చేసి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు.  కానీ ఇటీవలే మాత్రం విరాట్ కోహ్లీ కొన్నాళ్ళ విశ్రాంతి తర్వాత ఆసియా కప్లో టీమ్ ఇండియా లో చేరిన విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి రావడం పై అటు మాజీ క్రికెటర్లు అందరి ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. విరాట్ కోహ్లీ పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎన్నో అవమానాలు భరించిన అభిమానులు ఇప్పుడు విరాట్ కోహ్లీ వీర బాదుడు చూసి ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లొ విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమం లోనే విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డు సాధించాడు అన్నది తెలుస్తోంది. ఇటీవల సెంచరీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాను అని నిరూపించిన విరాట్ కోహ్లీ అటు టి20 ఫార్మాట్ క్రికెట్లో వంద సిక్సర్లు బాదిన రెండవ భారత క్రికెటర్గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  అయితే ఈ జాబితాలో టీమ్ ఇండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. ఇలా విరాట్ కోహ్లీ సెంచరీతో మళ్ళీ రికార్డుల వేట ప్రారంభించాడు అన్నది మాత్రం అర్థం అవుతుంది. కాగా కోహ్లీకి ఇది టీ20 ఫార్మాట్ లో మొదటి సెంచరీ కాగా కెరియర్ 71వ సెంచరీ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: