భారత మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే . మొన్నటి వరకు ఇంగ్లండ్ గడ్డపై జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో భాగంగా అద్భుతంగా రాణించిన టీమిండియా జట్టు బంగారు పథకానికి అడుగు దూరంలో ఆగిపోయి సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుంది.  కామన్వెల్త్ క్రీడల్లో  ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లో విజయం  సాధించి ముందుకు దూసుకుపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ ఆడుతుంది భారత మహిళల జట్టు. కాగా ఇప్పుడు కూడా భారత జట్టు మునుపటిలాగానే జోరు కొనసాగిస్తుందని అందరూ అనుకున్నారు.


 కానీ ఊహించని రీతిలో భారత మహిళల జట్టు కు టి20 సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ లోనే చేదు అనుభవం ఎదురైంది.  అటు ఇంగ్లాండ్ జట్టుకు భారత మహిళల జట్టు మొదటి టి20 మ్యాచ్ లో ఎక్కడ పోటీ ఇవ్వలేక పోయింది అని చెప్పాలి. తద్వారా ఓటమితో నిరాశలో మునిగిపోయింది. మొదటి మ్యాచ్లో విజయం ద్వారా 1-0 తేడాతో ఆధిక్యాన్ని సాధించింది ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు.  ఈ క్రమంలోనే ఇక భారత్ కి సిరీస్ అవకాశాలు ఎంతో క్లిష్టంగా మారిపోయాయ్. సిరీస్ కైవసం చేసుకోవాలని అంటే తర్వాత రెండు మ్యాచ్ లలో కూడా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 కాగా టీ 20 మ్యాచ్లో భారత మహిళల జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతోంది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన హర్మన్ ప్రీత్ కౌర్ సేనా తప్పులను సరిదిద్దుకుని మళ్లీ పుంజుకోవాలి అని భావిస్తుంది. ఈక్రమంలోనే రెండో మ్యాచ్లో విజయఢంకా మోగించాలి అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంది  సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలనీ భావిస్తోంది హర్మన్ ప్రీత్ కౌర్ సేన. కాగా నేడు రెండవ టీ20 మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. దర్భిషైర్  వేదికగా జరిగే ఈ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ జట్టు గీతలిస్తే 1-1 తో సమం చేస్తుంది. ఓడిపోతే మాత్రం ఇక ఇండియా సిరీస్ కోల్పోతుంది అని చెప్పాలి. నేడు రాత్రి 11 గంటలకు ఈ మ్యాచ్ సోనీ సిక్స్ లో ప్రత్యక్షప్రసారం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: