ఆస్ట్రేలియా జట్టు ఇండియా పర్యటన లో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు టి 20 సిరీస్ ఆడబోతున్న విషయం తెలిసిందే. టి20 సిరీస్ లో ఆస్ట్రేలియా పై విజయం సాధించి మరో సారి టీ20 లపై పట్టు సాధించాలని టీమిండియా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితి సద్దుమణిగిన నేపథ్యంలో మొన్నటి వరకు జరిగిన విధంగా ఒకే వేదికపై కాకుండా దేశంలోని పలు వేదికలపై ఇక ఈ టి 20 సిరీస్ లోని మూడు మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఒక మ్యాచ్ జరగబోతోంది.  కరోనా వైరస్ తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్లో జరగాల్సిన మ్యాచ్లను కూడా జరగకుండా అటు బీసీసీఐ కఠిన  నిబంధనలు విధించింది.. దీంతో  ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉప్పల్ స్టేడియం కాస్త అంతర్జాతీయ మ్యాచ్లకు దూరం అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఒక అంతర్జాతీయ మ్యాచ్ జరగబోతోంది.


 ఇందుకోసం ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈనెల 20 నుంచి టి20 సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.  ఈ మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా 25వ తేదీన మూడవ టీ20 మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం లో జరగనుంది. కాగా మ్యాచ్ 7:30 గంటలకు ప్రారంభం కానుండగా.. టికెట్లు రేపటి నుంచి పేటీఎం వెబ్సైట్లో అందుబాటులో ఉంచపోతున్నట్లు  తెలుస్తోంది. ఇక విద్యార్థులకు టిక్కెట్ల ధరల పై స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: