నిజంగా వారికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి. వారిలో ఈవిన్ లూయిస్, జాన్సన్ చార్లెస్ లు ఉన్నారు. ఇక ప్రస్తుతం వీరు స్వదేశంలో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నారు. కాగా జట్టును ప్రకటించిన వెంటనే చాలామందికి షాక్ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే టీ 20 ఫార్మాట్ లో ప్రపంచ వ్యాప్తంగా టోర్నీలు ఆడుతూ కీలక ఆటగాళ్లుగా ఉన్న ఇద్దరికి ఈ వరల్డ్ కప్ టీం లో సెలెక్ట్ చేయలేదు. వీరు ప్రస్తుతం గొప్ప ఫామ్ లో లేకపోయినా ఏ క్షణం అయినా మ్యాచ్ ను మలుపు తిప్పగల సమర్థులు. ఇద్దరూ కూడా ఆల్ రౌండర్ లు కూడా మరో ప్రత్యేకత. వారు ఎవరంటే... అండ్రే రస్సెల్ మరియు సునీల్ నరైన్.
ప్రస్తుతం వీరు అంత గొప్ప ఫామ్ లో ఏమీ లేకపోయినా అనుభవజ్ఞులైన వారు జట్టులో ఉంటే కీలక సమయంలో జట్టు విజయావకాశాలు మెరుగుపడే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వెస్ట్ ఇండీస్ క్రికెట్ యాజమాన్యం ఇంత షాకింగ్ నిర్ణయం తీసుకుంటారని ఎవ్వరూ అనుకోలేదు. ఇక వాస్తవంగా చెప్పాలంటే వీరిద్దరికీ కూడా దేశం తరపున ఆడడం కన్నా లీగ్ లలో ఆడడమే ఎక్కువ ఇష్టం అని తెలుస్తోంది.