ముఖ్యంగా శ్రీలంక లాంటి జట్టు మీద రెండు సార్లు ఓడిపోయింది. అయితే గత కొంతకాలంగా పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న ఫఖార్ జమాన్ ఈ టోర్నీలో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మొత్తం ఆరు మ్యాచ్ లలో బ్యాటింగ్ చేసిన ఫకార్ కేవలం ఒక్క అర్ద సెంచరీతో 96 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వన్ డౌన్ గా బ్యాటింగ్ కు వచ్చిన జమాన్ కీలకమైన సమయంలో కూడా జట్టును ఆదుకోలేక ఫెయిల్ అయ్యాడు. ఇక శ్రీలంక తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అయితే తాను ఈదుకొన్న తొలిబంతికే వికెట్ల మీదకు బంతిని ఆడుకుని బౌల్డ్ అయ్యాడు. ఈ ప్రదర్శన అతని పాలిట శాపమైంది. కొద్ది సేపటి క్రితం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అక్టోబర్ 16 నుండి జరగనున్న టీ 20 ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించింది.
అయితే ఈ జట్టులో పాకిస్తాన్ తరపున వన్ డే లలో డబల్ సెంచరీ చేసిన ఒకే ఒక్కడు ఫఖార్ జమాన్ కు మెయిన్ జట్టులో చోటు దక్కలేదు. అంటే... 15 మందితో కూడిన ప్రాబబుల్స్ లో జమాన్ చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే తూతూ మంత్రంగా రిజర్వు ప్లేయర్స్ 4 లలో ఒకడిగా ఎంపిక చేసింది. అయితే ఆల్రెడీ జట్టులో ఉన్న ఎవరికైనా గాయం కారణంగా ఆడలేకపోతే మాత్రమే ఇతను ఆడడానికి అవకాశం ఉంటుంది.