సాధారణంగా క్రికెట్ లో ఎలాంటి రూల్స్ ఉంటాయి అన్న విషయం పై క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఒక అవగాహన ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా ఆటగాడు గాయపడ్డాడు అంటే చాలు అతని స్థానంలో మరొక క్రికెటర్ సబ్స్టిట్యూట్ గా మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడం చూస్తూ ఉంటాము. అయితే ఇలా సబ్స్టిట్యూట్ గా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే రూల్స్ ప్రకారం అవకాశం ఉంటుంది. బౌలింగ్ బ్యాటింగ్ చేయడానికి మాత్రం అర్హత ఉండదు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ రూల్ విషయంలో బిసిసిఐ సరికొత్త నిర్ణయం  తీసుకోబోతోంది అన్నది తెలుస్తుంది.


 సబ్స్టిట్యూట్ ఆటగాడి విషయంలో సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ అనే నయా రూమ్ ను అమలులోకి తీసుకు రాబోతుంది. ఇక ఈ రూల్ అమల్లోకి వచ్చింది అంటే చాలు ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాడిని మార్చుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం ఇన్నింగ్స్ ప్రారంభమైన తర్వాత 14 ఓవర్ల లోపు ఇరు జట్ల నుంచి ఒక్కో ఆటగాడిని మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.


 తద్వారా మ్యాచ్ మధ్యలో ఆటగాడికి గాయం అయినా లేదా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కూడా స్థానంలో మరో ఆటగాడిని మైదానంలో బరిలోకి దింపేందుకు అవకాశం ఉంది. కాగా రూల్ ప్రకారం సబ్స్టిట్యూట్ ప్లేయర్ కేవలం ఫీలింగ్ మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఇంపాక్ట్ రూల్ ప్రకారం 14 ఓవర్ల లోపు ఎవరైనా ఆటగాడు గాయపడినా లేదా మ్యాచ్ అప్పటి స్థితిగతులను బట్టి ఆటగాడిని మార్చుకోవాలని భావించిన ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ తో పాటు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ రూల్ కేవలం క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించే బిగ్ బాష్ లీగ్ లో మాత్రమే అమల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: