ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ ఆడబోయే తదుపరి మ్యాచ్ లో అతని ప్రదర్శనలు ఎలా ఉండబోతోంది అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతోమంది మాజీ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్లో కోహ్లీ సెంచరీ కారణంగా విరాట్ కోహ్లీ కెరియర్లో 71 వ సెంచరీ నమోదు చేశాడు. ఇక తద్వారా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు అనే చెప్పాలి.
ఇకపోతే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్ సాధించిన వంద శతకాల రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. రికీపాంటింగ్ ఐసిసి రివ్యూ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత కాలంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో కాస్త నెమ్మదించిన ప్పటికీ సచిన్ రికార్డును మాత్రం తప్పక బ్రేక్ చేస్తాడు. ఇందులో అనుమానమేమీ లేదు. ఇంకా ఎన్నో ఏళ్ల పాటు క్రికెట్ ఆడ గలిగే సత్తా అతనిలో ఉంది. ఏ రికార్డు అయినా సరే సాధించలేడు అని చెప్పలేం. ఎందుకంటే అతనిలో విజయ దాహం తీరనిది అంటూ రికీపాంటింగ్ చెప్పుకొచ్చాడు.