ఇక నిన్న రాత్రి ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి 20 మ్యాచ్ లో ఇండియా ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు కానీ ... బ్యాటింగ్ గురించి కానీ పెద్ద కంప్లైంట్స్ లేవు. ఉన్న 6 మంది బ్యాట్స్మన్ లలో ఏ ముగ్గురు రాణించినా పోటీ ఇవ్వగలిగే స్కోర్ ను సాధించవచ్చు. అయితే ఎంత స్కోర్ చేసినా దానిని డిఫెండ్ చేయగలిగే నైపుణ్యం మాత్రం బౌలర్ల చేతుల్లోనే ఉంటుంది. కానీ అలాంటి బౌలర్లే విఫలం అయితే ? పరిస్థితి ఏమిటి ? సరిగ్గా రాత్రి మ్యాచ్ లో ఇదే జరిగింది.
ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకరైన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు తుక్కురేగొట్టారు. ఇతను తన బౌలింగ్ లో 4 ఓవర్ లలో 52 పరుగులు సమర్పించుకుని ఓటమికి కారణం అయ్యాడు. ఇక హర్షల్ పటేల్ ది అదే పరిస్థితి. ఈ ఇద్దరూ కూడా ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. ఒక్క అక్షర్ పటేల్ తప్ప మిగిలిన బౌలర్ ఎవ్వరూ ప్రభావం చూపకపోవడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీగా షాట్ లు ఆడి మ్యాచ్ ను ఇండియా చేతుల్లోంచి లాగేసుకున్నారు. ఈ రకమైన ప్రదర్శనను ఇండియా అభిమాని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ ఓటమికి బాధ్యులు ఎవ్వరు అని చెప్పాలి. జట్టును మైదానంలో ముందుకు నడిపించి కెప్టెన్ దా ? లేక సరిగా ప్రదర్శన చేయని ఆటగాళ్లదా ? లేదా అటువంటి జట్టును సెలెక్ట్ చేసిన కోచ్ దా ? అంటూ అభిమానులు శివాలెత్తి పోతున్నారు.