సాధారణంగా క్రికెటర్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. ఎందుకంటే మంచి ప్రదర్శన చేసినప్పుడు ఎంతోమంది క్రికెటర్లను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. అదే సమయంలో కాస్త పేలవ ప్రదర్శన చేశారు అంటే ఒకప్పుడు పొగిడిన వారే ఆ తర్వాత దారుణమైన విమర్శలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతకుముందు వారు చేసిన అద్భుతమైన ప్రదర్శనలు మర్చిపోయి మరి విమర్శలు గుప్పించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతోంది.


 మొన్నటికి మొన్న ఆసియా కప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ వరుసగా 5 వికెట్లు పడగొట్టి ఇక ఆఫ్ఘనిస్తాన్ ఓటమిని శాసించాడు అని చెప్పాలి. కానీ అందరూ కూడా విరాట్ కోహ్లీ సెంచరీ గురించి మాట్లాడుకున్నారు. కానీ భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టిన విషయం గురించి ఎవరు ప్రస్తావించలేదు. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా భారత పర్యటనకు రాగ.. టీమిండియా తో జరిగిన మొదటి టి20 లో కీలకమైన 18 ఓవర్లో 22 పరుగులు ఇచ్చి పేలవ  ప్రదర్శనతో నిరాశపరిచాడు భువనేశ్వర్ కుమార్. దీంతో అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.


 సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తూ భువనేశ్వర్ కుమార్ ను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అతని పై వస్తున్న ట్రోలింగ్ ను ఉద్దేశిస్తూ ఇటీవలే భువనేశ్వర్ కుమార్ భార్యను నుపూర్ నగర్ ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ఈ క్రమంలోనే ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్యకాలంలో పని పాట లేని వారందరూ కూడా ద్వేషపూరిత ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇక్కడ మిమ్మల్ని పట్టించుకునే వారు ఎవరూ లేరు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. విమర్శలు చేసే సమయాన్ని మిమ్మల్ని మీరు ఉత్తమంగా మార్చుకునేందుకు ఉపయోగించుకోండి అంటూ సమాధానం ఇచ్చింది భువనేశ్వర్ సతీమణి నుపూర్ నగర్.

మరింత సమాచారం తెలుసుకోండి: