ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ కెప్టెన్లలో మొదటి వరుసలో వినిపించే పేరు మహేంద్ర సింగ్ ధోని. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్కు మహేంద్రసింగ్ ధోని దూరం అయినప్పటికీ అతను సాధించిన రికార్డులు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. భారత క్రికెట్ లో ఇప్పటివరకు కెప్టెన్ గా రెండు వరల్డ్ కప్ లు అందించిన ఏకైక సారధిగా కొనసాగుతూ ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోని. ఇక ధోనిని మిస్టర్ కూల్ అంటూ అభిమానులు ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. అయితే అతనికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 సాధారణంగా ధోని సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్గా ఉండడు. కానీ ధోని గురించి ఏదో ఒక పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో ఆర్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది. ఇక ధోని స్వయంగా ఏదైనా పోస్ట్ పెట్టాడు అంటే చాలు అది సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల మహేంద్రసింగ్ ధోని గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను  అంటూ ఒక పోస్ట్ పెట్టాడు అనే విషయం తెలిసిందే. దీంతో అభిమానులు ఆ గుడ్ న్యూస్ ఏమై ఉంటుందా అని ఊహాగానాల్లోకి వెళ్లిపోయారు. కొంతమంది ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడేమో అని ఊహించుకోవడం మొదలుపెట్టారు.


 కానీ గుడ్ న్యూస్ అంటూ అభిమానులు అందరినీ ఊరించి అందరిని ఊహాగానాల్లోకి నెట్టిన మహేందర్ సింగ్ ధోని చేసిన పనికి ఇప్పుడు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడ్ న్యూస్ చెబుతానని అభిమానులలో ఆత్రుత కలిగించిన మహేంద్ర సింగ్ ధోని ఒక బిస్కెట్ బ్రాండ్ లాంచ్ చేస్తున్నట్లు తెలిపాడు. అయితే ఇది ఒక కమర్షియల్ ప్రకటన కావడం గమనార్ధం. దీంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ ప్రకటన కోసం గుడ్ న్యూస్ అంటూ అభిమానులను ఇంతలా ఆత్రుత పెట్టాలా అంటూ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: