ఇకపోతే మొదటి టి20 మ్యాచ్ కు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి. కాగా ఇటీవల విరాట్ కోహ్లీ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మ్యాచ్ విజయ అనంతరం తిరువనంతపురం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు టీమిండియా ఆటగాళ్లు. ప్రత్యేకమైన బస్సులో బయలుదేరారు. అయితే టీమిండియా ఆటగాళ్లను చూసేందుకు అప్పటికే అభిమానులు హోటల్ బయట గుమిగూడారు. భారత క్రికెటర్లు బస్సు ఎక్కగానే ఇక కేరింతలు కొట్టారు.
విరాట్ కోహ్లీని చూడగానే అభిమానుల్లొ మరింత జోష్ వచ్చింది. దీంతో కోహ్లీ కోహ్లీ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అయితే ఇలా అభిమానులు అరుస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఇక అంతలో అభిమానులు అరవడంతో స్పందించిన విరాట్ కోహ్లీ బస్సు అద్దంలో నుంచి అనుష్కతో వీడియో కాల్ లో ఉన్నాను. డిస్టర్బ్ చేయకండి అన్నట్లుగా ఫోన్ చూపిస్తూ నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా అక్టోబర్ రెండవ తేదీన ఆదివారం రెండవ టి20 మ్యాచ్ జరగబోతుంది.