నిన్న పూర్తి అయిన మొదటి సెమీఫైనల్ లో ఇండియా ఆస్ట్రేలియా ను ఢీకొట్టి గెలిచి ఫైనల్ కు చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా లెజెండ్స్ నిర్ణీత ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అయితే ఆస్ట్రేలియాకు ఉన్న బౌలింగ్ అటాక్ కు ఈ స్కోర్ ను కాపాడుకోవడం సులభమే. కానీ ఇండియా బ్యాటింగ్ ముందు ఆస్ట్రేలియా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇండియా లెజెండ్స్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి గర్వంగా ఫైనల్ కు చేరుకున్నారు. రేపు ఫైనల్ మ్యాచ్ జరగనుంది, కాగా ఈ రోజు జరగబోయే రెండవ సెమీఫైనల్ లో గెలిచిన జట్టు రేపు ఇండియాతో తలపడనుంది.
ఈ రోజు సాయంత్రం శ్రీలంక మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. మరి ఎవరు గెలిచి ఫైనల్ లో ఇండియా తో తలపడుతారో చూడాలి. అయితే ఫామ్ ను బట్టి చూస్తే శ్రీలంక దుర్బేధ్యమైన ఫామ్ లో ఉంది. ముఖ్యంగా జయసూర్య, దిల్షాన్, తరంగ లు అదరగొడుతున్నారు.