టి20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు టీం ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పాలి. ఇప్పటికే రవీంద్ర జడేజా లాంటి కీలక ఆటగాడు దూరం కావడం కారణంగా టీమిండియా కాంబినేషన్ మొత్తం ఒక్కసారిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఇక భారత బౌలింగ్ విభాగాన్ని ముందుకు నడిపించే కీలక బౌలర్ బుమ్రా జట్టులో ఉన్నాడు అన్న ధైర్యం అటు టీమిండియా అభిమానుల్లో ఉండేది. కానీ ఇటీవల వెన్నునొప్పి గాయం కారణంగా చివరికి బుమ్రా కూడా జట్టుకు దూరమయ్యాడు.


 కాగా కొన్ని రోజుల నుంచి జస్ ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమయ్యాడు అంటూ వార్తలు రాగా బిసిసిఐ మాత్రం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో బుమ్రా మళ్లీ జట్టులోకి వస్తాడు అనే చిన్న నమ్మకం ఉండేది.  కానీ ఇటీవలే అటు భారత క్రికెట్ కౌన్సిల్ కూడా బుమ్రా జట్టుకు దూరమయ్యాడు అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో భారత అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి. బుమ్రా లేకుండా అటు టీమిండియా వరల్డ్ కప్ లో ఎలా రాణిస్తుంది అన్న విషయాన్ని కూడా ఊహించుకోలేకపోతున్నారు.


 అయితే కేవలం క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు అటు సహచర ఆటగాళ్లు కూడా బుమ్రా తో ఉన్నా ఎంతగానో మిస్ అవుతున్నారు అన్నది తెలుస్తుంది.. ఈ క్రమంలోనే ఇటీవల బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరం అవడంపై స్పందించిన స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. మై జెస్సి.. నువ్వు ఎప్పటి లాగానే బలంగా తిరిగి రావాలి అంటూ.. లవ్ సింబల్స్ జత చేశాడు హార్దిక్ పాండ్యా. ఇక హార్దిక్ పాండ్యా పెట్టిన పోస్ట్ కు అటు అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది అని చెప్పాలి. ఇకపోతే మరికొంతమంది మాజీ క్రికెటర్లు కూడా బుమ్రా లేకుండా టీమిండియా పరిస్థితి ఏంటి అన్న విషయంపై కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: