ఈ క్రమంలోనే అటు సెలెక్టర్లు ఇటు ప్రేక్షకులు కూడా టీ20 వరల్డ్ కప్ లో శిఖర్ ధావన్ లేడు అన్న విషయం అసలు పట్టించుకోవడం లేదు అని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికే పలుమార్లు టీమ్ ఇండియా వన్డే కెప్టెన్సీ చేపట్టి జట్టుకు విజయాలను అందించిన దావన్ ఇక ఇప్పుడు మరోసారి కెప్టెన్సీ వహించేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టు ఇటీవల టి20 సిరీస్ పూర్తిచేసుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమయింది. కాగా టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ఎన్నో రోజులు లేని నేపథ్యంలో ఇక వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లు అందరికీ కూడా విశ్రాంతి ఇస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే శిఖర్ ధావన్ మళ్ళీ కెప్టెన్సీ చేపట్టి జట్టును విజయపథంలో ముందుకు నడిపించేందుకు సిద్ధమయ్యాడు.. ఇకపోతే ఇటీవల నిర్వహించిన ప్రైస్ కాన్ఫరెన్స్ లో భాగంగా శిఖర్ ధావన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన అనుభవం నాలెడ్జును యువ ఆటగాళ్లకు చెప్పేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అంటూ పేర్కొన్నాడూ. వచ్చే యేడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం ఎంతో ఫిట్ గా తయారు కావడంపైనే ప్రస్తుతం తాను దృష్టి సాధించాను అంటూ చెప్పుకొచ్చాడు శిఖర్ ధావన్ ఇప్పటికే టీ20 లకు దూరమైన శిఖర్ ధావన్ వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో భాగం అవ్వబోతున్నాడూ అన్నది తెలుస్తుంది.