సాధారణం గా భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి అని చెప్పాలి. ఇలా భార్యా భర్తల మధ్య చిన్న పాటి గొడవలు జరిగినప్పుడే ఇక దాంపత్య బంధం స్వీట్ మెమరీగా మారి పోతుంది అని అంటూ ఉంటారు ఎంతో మంది నిపుణులు. అయితే ఇటీవలే కాలం లో మాత్రం భార్యాభర్తల మధ్య తలెత్తుతున్న చిన్నపాటి గొడవలు ఇక ఎన్నో దారుణాలకు కారణమవుతున్నాయ్ అని చెప్పాలి. చిన్న చిన్న గొడవల కారణం గానే కష్ట సుఖాల్లో  పాలు పంచుకోవలసిన భార్యా భర్తలు భద్ర శత్రువులుగా మారి పోతున్నారు.


 అయితే ఇటీవల కాలం లో మానవత్వం బ్రతికే ఉంది అన్నదానికి నిదర్శనగా కొంత మంది వ్యక్తులు వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరైనా గొడవ పడుతున్నారు అంటే చాలు ఇక చూసి చూడనట్లు వెళ్ళి పోకుండా ఆ గొడవను సర్దుమనిగేలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇలా చేసి కొంత మంది ప్రమాదాల బారిన పడటం కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో మధ్యలోకి వెళ్లిన వ్యక్తి చివరికి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ షాకింగ్ ఘటన భోపాల్ లో వెలుగు చూసింది.



 పప్పు అనే వ్యక్తి తన భార్యకు మటన్ వండాలని చెప్పాడు.. అయితే ఆమె మాత్రం మటన్ వండలేదు కదా భర్తతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలోనే వీరిమధ్య మాటలు యుద్ధం చిలికి చిలికి గాలి వానలా మారిపోయింది. దీంతో పక్కనే ఉన్న వ్యక్తి అయ్యో పాపం భార్య భర్తలు గొడవ పడుతున్నట్టున్నారు సర్ది చెబుతాం  అంటూ వారి మధ్యలోకి వెళ్లాడు. ఈ క్రమంలోని గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన పప్పు అతని ఇంటికి వెళ్లి తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు నిందితుని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: