ఇండియా మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ ను చివరి బంతిలో ఓడించి మంచి జోరు మీద ఉండగా, నెదర్లాండ్ మాత్రం తన మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో ఓడిపోయి విజయం కోసం ఆడనుంది. అయితే ఈ టోర్నీకి అర్హత సాధించిన ప్రతి టీం కూడా అసాధారణమైనవే అని చెప్పాలి. ఏ జట్టు ఎప్పుడు ఎవరిని ఓడిస్తుంది అన్నది ఊహించలేము. అందుకు సరైన ఉదాహరణ నిన్న ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ ల మ్యాచ్... పూర్తి ఓవర్ లు జరిగుంటే పరిస్థితి ఏమిటో అన్నది పక్కన పెడితే... ఆ సమయానికి ఇంగ్లాండ్ కన్నా అయిదు పరుగులు ఎక్కువ ఉండడంతో ఐర్లాండ్ గెలవడం సూపర్.
అందుకే ఇండియా కూడా తన ప్రత్యర్థి నెదర్లాండ్ ను తక్కువ అంచనా వేయకూడదు. ముఖ్యంగా జట్టులో మార్పులు కూడా చేయడం మంచిది కాదన్నది కొందరి క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలం అయిన రాహుల్, రోహిత్ మరియు సూర్యకుమార్ యాదవ్ లకు మంచి అవకాశం అని చెప్పాలి. ఓపెనింగ్ కుదురుకోవలసిన అవసరం ఎంతకైనా ఉంది, రోహిత్ మొదటి రెండు మూడు ఓవర్లలో నిదానంగా ఆడుతూ కుదురుకున్నాక తన సహజమైన ఆటపై దృష్టి పెడితే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.