సాధారణంగా టి20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కింది అంటే ఇక ఆటగాళ్ల ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టు తరఫున మంచి ప్రదర్శన కనబరచాలని ఎంతో మంది భావిస్తూ ఉంటారు. ఇక ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా బీసీసీఐ ఎలెక్టర్లు 15 మంది సభ్యులను ఎంపిక చేయగా ఇక సెలెక్ట్ అయిన ఆటగాళ్లు సంబరపడిపోయారు. కానీ కొంతమంది ఆటగాళ్లకు మాత్రం నిరాశ ఎదురయింది అని చెప్పాలి. ఇక అలాంటి ఆటగాళ్లలో మనికట్టు స్పిన్నర్  చాహాళ్ తో పాటు ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ కూడా ఉన్నారు.


 జట్టులో ఉన్న 15 మంది సభ్యులలో దాదాపు 13 మందికి తుది జట్టులో అవకాశం దక్కింది. కానీ చాహల్, హర్షల్ పటేల్ మాత్రం అటు వరల్డ్ కప్ లో భాగంగా ఒక్క మ్యాచ్లో కూడా తుది జట్టులో అవకాశం దక్కించుకోకపోవడం గమనార్హం. అయితే అశ్విన్ అటు ప్రతి మ్యాచ్ లో విఫలం అవుతున్నప్పటికీ చాహల్ను మాత్రం తుదిజట్టులోకి తీసుకునేందుకు సెలక్టర్లు పెద్దగా మొగ్గు చూపలేదు. ఈ క్రమంలోనే ఈ విషయంపై విమర్శలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ కప్ తర్వాత ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనకు యువ ఆటగాళ్లు వెళ్లగా.. సీనియర్లు కోహ్లీ,రోహిత్, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్ లకు విశ్రాంతి ప్రకటించింది జట్టు యాజమాన్యం.


 ఈ క్రమంలోనే ఇటీవల ఒక క్రీడా చానల్ తో మాట్లాడిన దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్ రాహుల్ ద్రావిడ్,  కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో అద్భుతమైన వాతావరణాన్ని కల్పించారు అంటూ  చెప్పుకొచ్చాడు. ఇక తుది జట్టులో స్థానం దక్కని వారిద్దరితో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉండేవారు అంటూ చెప్పుకొచ్చాడు. చాహల్, హర్షల్ పటేల్ లు మాత్రమే ఈ టి20 ప్రపంచ కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని భారత ఆటగాళ్లు.  అయితే వారేమీ ఆగ్రహానికి గురికాలేదు. నిరుత్సాహపడలేదు. ఎందుకంటే టోర్నీ ప్రారంభానికి ముందే గడ్డు పరిస్థితుల్లో ఆడుతున్నాం అన్న విషయాన్ని కోచ్, కెప్టెన్ వారికి వివరించి చెప్పారు. ఇక చోటు దక్కని వారిలో నెగటివ్ ఆలోచనలకు తావులేకుండా చేశారు అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: