ఐపీఎల్ ద్వారా తనలో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకుని ఇక ఆ తర్వాత టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు యువ ఆటగాడు శుభమన్ గిల్. ఇలా టీమిండియాలోకి వచ్చిన తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఓపెనర్ గా బరిలోకి దిగుతూ భారీగా పరుగులు చేస్తూ టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ ప్లేయర్ తానే అన్న విషయాన్ని నిరూపించాడు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి టెస్టులలో వన్డే ఫార్మాట్లో రెగ్యులర్గా స్థానం సంపాదించుకుంటున్నాడు శుభమన్ గిల్.


 అయితే ఇప్పుడు వరకు ఐపీఎల్ లో కూడా పలు జట్ల తరఫున ఆడి తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక గత ఏడాది జరిగిన మెగా వేలంలో భారీ ధర పలికిన ఆటగాళ్లలో శుభమన్ గిల్ ఒకడిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఇప్పటివరకు దేశవాళి టి20 క్రికెట్ తప్ప అటు భారత జట్టు తరపున టి20 ఫార్మాట్లో ఒక మ్యాచ్ ఆడలేదు. అయితే మొదటిసారి శుభమన్ గిల్  న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమ్ ఇండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది.  ఈ క్రమంలోనే అతని ప్రదర్శన ఎలా ఉండబోతుంది అన్నదానిపైనే అందరి దృష్టి ఉంది అని చెప్పాలి.


 ఇకపోతే గత కొంతకాల నుంచి తన కెరీర్ లో ఎదురైన అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నాడు శుభమన్ గిల్. ఇక మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీలతో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ బెస్ట్ కెప్టెన్ అంటూ శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు. తాను భారత జట్టు తరఫున ఆడిన మ్యాచ్లలో అత్యుత్తమ కెప్టెన్ విరాట్ కోహ్లీనే అంటూ తెలిపాడు. కోహ్లీ ఎప్పుడు ఆటకాళ్లలో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: