గత కొంతకాలం నుంచి తన అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో ప్రపంచ క్రికెట్ లో చర్చనీయాంశంగా మారిపోయిన టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ న్యూజిలాండ్ పై చేసిన అద్భుతమైన సెంచరీ తో మరోసారి అందరూ తన గురించి చర్చించుకునేలా చేసాడు. క్రీజు లోకి వచ్చిన మొదటి బంతి నుంచి సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయిన సూర్య కుమార్ యాదవ్ న్యూజిలాండ్ బౌలర్ల పై పూర్తి ఆదిపత్యాన్ని కనబరిచాడు. ఈ క్రమంలోనే 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి తనకు బ్యాటింగ్ కి ఇక తిరుగులేదు అని నిరూపించాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ సాధించిన అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి అటు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు మాత్రమే కాదు సహచర ఆటగాళ్లు సైతం స్పందిస్తూ ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. అయితే భారత జట్టులో ఏ ఆటగాడు మంచి ప్రదర్శన చేసిన కల్మషం లేకుండా ప్రశంసలు కురిపించే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ వీరోచితమైన సెంచరీపై మరోసారి తనదైన శైలిలో స్పందించి ప్రశంసించాడు. ఇక విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు కాస్త అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.


 సూర్య కుమార్ యాదవ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆటగాడు ఎందుకు అయ్యాడో చెప్పడానికి ఈ ఒక్క ఇన్నింగ్స్ చాలు అంటూ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. నేను అతడు ఇన్నింగ్స్ ను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ఇది మాత్రం అతడి మరొక వీడియో గేమ్ ఇన్నింగ్స్ అయి ఉంటుంది అంటూ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా సూర్య ఇన్నింగ్స్ పై స్పందించాడు. ఈ క్రమంలోనే కోహ్లీ పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. కాగా ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో టీం ఇండియా జట్టు 65 పరుగులు తేడాతో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: