ఇక మిగిలిన ఆఖరి టీ 20 మ్యాచ్ రేపు నేపియర్ లో జరగనుంది. కాగా ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే సిరీస్ ను దక్కించుకుంటుంది, లేదా కివీస్ ఇందులో గెలిస్తే సిరీస్ 1-1 తో సమం అవుతుంది. అయితే కివీస్ కు ఈలోపే భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ మరియు బ్యాట్స్మన్ కేన్ విలియమ్సన్ ఆఖరి మ్యాచ్ ను ఆడడం లేదన్నది కివీస్ నుండి అధికారిక సమాచారం. తాను అనారోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు తీసుకున్న మెడికల్ అపాయింట్మెంట్ కు వెళ్ళడానికి రేపు మ్యాచ్ కు దూరం కానున్నాడు. ఇక ఇతని స్థానంలో యువ ఆటగాడు మార్క్ చాప్ మాన్ ఆడే అవకాశం ఉంది. కెప్టెన్ గా సీనియర్ ఆటగాడు టిమ్ సౌథీ బాధ్యతలు తీసుకోనున్నాడు.
వన్ డే సిరీస్ కు యధావిధిగా ఇతను అందుబాటులోకి రానున్నాడు. నిన్న ఓడిన మ్యాచ్ లో విలియమ్సన్ ఒంటరి పోరాటం చేశాడు... జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయినా అర్ధ సెంచరీతో రాణించాడు. మరి ఇతను లేకుండా ఆఖరి మ్యాచ్ లో కివీస్ ఏ మేరకు ఆడి గెలిచి సిరీస్ ను సమం చేస్తుందా అన్నది తెలియాలంటే రేపు మ్యాచ్ వరకు ఆగాల్సిందే.