గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ విధ్వంసం ఎంతలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టి20 ఫార్మాట్లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. కేవలం ఏడాది తిరగకుండానే అటు ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ స్థానాన్ని దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు  తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకునే విధంగానే తన అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతూ ఉన్నాడు. బౌలర్ల పై వీర విహారం చేస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి.


 ఇక సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చూసిన తర్వాత వావ్ సూపర్ ఇలాంటి షాట్లను ఇప్పటివరకు మేము ఎప్పుడూ చూడలేదు అని ఏకంగా క్రికెట్ అభిమానులందరూ కామెంట్లు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మైదానం నలువైపులా ఎంతో అలవోకుగా షాట్లు ఆడుతున్న సూర్య కుమార్ యాదవ్ బౌండరీలతో చెలరేగిపోతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. న్యూజిలాండ్తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో కూడా 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి సెంచరీ తో అదరగొట్టాడు సూర్య కుమార్. దీంతో అతనిపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.


 ఇలాంటి సమయంలోనే ఇక టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ గురించి రోహిత్ శర్మ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. చెన్నైలో జరిగిన బీసీసీఐ అవార్డుల వేదిక పూర్తయింది. అయితే భవిష్యత్తులో టీంలోకి కొందరు ఉత్తేజ కరమైన ఆటగాళ్లు రాబోతున్నారు. ముఖ్యంగా ముంబైకి చెందిన సూర్య కుమార్ యాదవ్ రాబోతున్నాడు అంటూ రోహిత్ శర్మ అప్పట్లో ఒక పోస్ట్ పెట్టగా ఇది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇది చూసిన రోహిత్ అభిమానులు సూర్యకుమార్ గురించి రోహిత్ ఎప్పుడో చెప్పాడు అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: