ఈ క్రమంలోనే కొచ్చి వేదికగా డిసెంబర్ 23వ తేదీన ఐపీఎల్ మినీ వేలం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ మినీ వేలంలో ఎంతోమంది ఆటగాళ్ళను తమ జట్టులోకి తీసుకుని ఇక జట్టును మరింత పటిష్టవంతంగా మార్చుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఐపీఎల్ వేలంలో పాల్గొనాలి అనుకుంటున్నా ఆటగాళ్లకు ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి డెడ్ లైన్ విధించింది. వేలం బరిలో ఉండాలనుకునే ఆటగాళ్లు డిసెంబర్ 15లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా వేలంలో పాల్గొనాలి అని ఆటగాళ్లు. ఇక తమ పేర్లను ఎన్ రోల్ చేసుకోకపోతే మాత్రం మినీ వేళానికి వాళ్లు అనర్హులు అంటూ ప్రకటించింది బీసీసీఐ. ఈ క్రమంలోనే మినీ వేలంలో భాగం కావాలని భావిస్తున్న ఎంతోమంది ఆటగాళ్లు ఇక తమ పేరును ఎన్ రోల్ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు అని చెప్పాలి. అయితే 10 ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్లతో కలుపుకొని మొత్తంగా250 మంది ప్లేయర్స్ వరకు ఇక డిసెంబర్ 23వ తేదీన జరగబోయే మినీ వేలంలో పాల్గొనే అవకాశం ఉందని బిసిసిఐ అంచనా వేస్తోంది. ఇక ఇందులో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు అని చెప్పాలి.