ఇటీవల కాలంలో మనిషి ఆలోచన తీరు రోజురోజుకు దారుణంగా మారిపోతుంది అని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు బంధాలకు బంధుత్వాలకు విలువ ఇచ్చిన మనుషులు ఇక ఇప్పుడు క్షణకాల సుఖం కోసం ఆ బంధాలకు విలువ ఇవ్వకుండా నీచమైన పనులు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వనివారు పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి ఎన్నో నేరాలకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా అక్రమ సంబంధాల కారణంగా నేటి రోజుల్లో జరుగుతున్న హత్యలు ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి.


 కేవలం పరాయి వ్యక్తులు మాత్రమే కాదు ఇక ఇంట్లో ఉండే సొంతవాళ్లు సైతం ఇలా బంధాలకు విలువ ఇవ్వకుండా అక్రమ సంబంధాలకు తెర లేపుతున్న  ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ అక్రమ సంబంధం అనుమానం చివరికి ఏకంగా కొడుకే తండ్రి ప్రాణం తీసేందుకు దారితీసింది అని చెప్పాలి. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. బెంగాల్ సీతాల్ కుచ్చి లో ఈ ఘోరం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అని అనుమానంతో ఒక వ్యక్తి ఏకంగా కన్నతండ్రినే దారుణంగా హత్య చేశాడు.



 ఇక ఈ కేసులో నిందితుడు మిథున్ అతని భార్య సుజాతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  అయితే గత కొంతకాలం నుంచి తన భార్యతో తండ్రి చనువుగా ఉండడం చూసిన మిథున్ తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే భార్య తండ్రి మధ్య అక్రమ సంబంధం ఉంది అని అనుమానపడ్డాడు. ఇక ఈ అనుమానం మరింత పెరిగిపోవడంతో నిద్రిస్తున్న సమయంలో సుత్తితో కొట్టి చంపేశాడు. ఇక ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు తమతైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: