సరిగ్గా వరల్డ్ కప్ ముందు వరకు కూడా తన కెప్టెన్సీ తో వరుసగా సిరీస్ లను గెలిపించిన రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అంతకుముందు ఆసియా కప్ లో కూడా నిరాశపరిచాడు. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. కెప్టెన్ గా మాత్రమే కాదు ఒక ఆటగాడిగా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఈ ఏడాది అటు టీమ్ ఇండియాకు ఒక పీడకలగా మారిపోయింది అని ఫ్యాన్స్ అంటున్నారు.
ఒక్క ఏడాదిలోనే అన్ని ఫార్మాట్లలో కలిపి ఏకంగా ఆరు సిరీస్లలో ఓడిపోయింది టీమిండియా జట్టు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఓడిపోయి ఈ ఏడాది మొదటి సిరీస్ ఓటమి నమోదు చేసింది అని చెప్పాలి. అదే సమయంలో ఇక సౌత్ ఆఫ్రికా తో జరిగిన వన్డే సిరీస్ ను కూడా కోల్పోయింది టీమిండియా జట్టు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండుతో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో కూడా ఓడిపోయి సిరీస్ చేజార్చుకొని నిరాశపరిచింది. ఆసియా కప్ లో ఫైనల్ కు చేరకుండానే నిష్క్రమించింది. టి20 వరల్డ్ కప్ లో సెమి ఫైనల్ నుంచి వెనుతిరిగింది. ఇక ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది.