ఒకప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్ గా పేరు సంపాదించుకున్న అజింక్య రహానే టీమిండియాలో వైస్ కెప్టెన్ గా కొనసాగాడు. టీం ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు అందులో అజంక్య రహనే ఉండేవాడు. కానీ ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ కొత్త కోచ్గా వచ్చాక విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇక వైస్ కెప్టెన్ గా ఉన్న రహానే మొత్తం టీమ్ లోనే ప్లేస్ కోల్పోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ వెటర్నటీ లీవ్ లో ఉన్న సమయంలో ఇక అజింక్య రహానే కెప్టెన్సీలో ఆడిన భారత జట్టు అదరగొట్టింది. అంతేకాదు ఏకంగా 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.


 కానీ ఆ తర్వాత మాత్రం అజింక్య రహానే ప్రభావం తగ్గుతూ వచ్చింది అని చెప్పాలి. ఇక తర్వాత వరసగా అవకాశాలు వచ్చినప్పటికీ ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి ఎంతగానో ఇబ్బంది పడిపోయాడు. ఏడాది ఆరంభంలో సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు అని చెప్పాలి. అయితే తనతో పాటు జట్టులో స్థానం కోల్పోయిన మరో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చతేశ్వర పూజార కౌంటి ఛాంపియన్షిప్ లో పాల్గొని మళ్ళీ తన మునుపటి ఫామ్ నిరూపించుకుని ఇక ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చేసాడు. ఇక ఇప్పుడు అజింక్య రహనే రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఇటీవల హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్లో డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు. పృథ్విషా 19 పరుగులు చేసి అవుట్ కాగా యశస్వి జైష్వాల్ 195 బంతుల్లో 162 పరుగులు చేశాడు. అజింక్య రహానే 261 బంతుల్లో 26 ఫోర్లు మూడు సిక్సర్లతో 2004 పరుగులు చేసి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో ఇక డబుల్ సెంచరీ చేసిన అజింక్య రహనే మళ్ళీ జట్టులోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: