గత కొంతకాలం నుంచి ఇంగ్లాండు క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అనే విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఏకంగా విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లాండు జట్టు ఆ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో ఓడిపోయింది. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత  అటు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు అక్కడ టెస్ట్ సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఎంతో దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ జట్టుని వారి సొంత దేశంలోనే ఓడించింది. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా వరుసగా మూడు విజయాలు సాధించిన ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ ను దారుణంగా ఓడించింది.



 అయితే జట్టులో ఉన్న పలువురు కీలక ఆటగాళ్లు గాయం బారిన పడి జట్టుకు దూరమైనప్పటికీ ఇంగ్లాండ్ జట్టు మాత్రం ఎంతో బాగా ఆడుతూ సమిష్టి కృషితో వరుస విజయాలు సాధిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఇక వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు ఇక ఇప్పుడు అదిరిపోయే సూపర్ గుడ్ న్యూస్ అందింది అన్నది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న జోఫ్రా ఆర్చర్ గాయం నుంచి కోలుకున్నాడు. దీంతో త్వరలో అతను జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.


 దాదాపు రెండేళ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ జఫ్రా ఆర్చర్ ఇక గాయం నుంచి కోలుకోవడంతో జట్టులోకి రాబోతున్నాడు. ఇక వచ్చే ఏడాది జనవరిలో సౌత్ ఆఫ్రికా తో జరిగే 3 సిరీస్ కోసం ఇంగ్లాండు క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన 14 మంది సభ్యుల జాబితాలో  ఆర్చర్ పేరు కూడా ఉండడం గమనార్హం . అయితే ఇక సదరు ఫాస్ట్ బౌలర్ మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న నేపద్యంలో ముంబై ఇండియన్స్ కూడా సంతోషంలో మునిగిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే గత ఏడాది జరిగిన మెగా వేలంలో భారీ ధర వెచ్చించి అతని కొనుగోలు చేసింది. కానీ గత సీజన్లో మాత్రం అత్తను ఆడలేదు. ఇక ఈసారి అందుబాటులోకి రానున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: