అయితే సంక్రాంతి వచ్చిందంటే సినిమా థియేటర్ల వద్ద కూడా స్టార్ హీరోల సినిమాలు విడుదలై పూనకాలు తెప్పిస్తూ ఉంటాయి. కేవలం ఇలా సాధారణ ప్రజలకు సినీ ప్రేక్షకులకు మాత్రమే కాదండి క్రికెట్ అభిమానులకు సైతం పూనకాలు వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిపోతూ ఇక తన అభిమానులందరికీ కూడా సరికొత్తగా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకునే విధంగా చేస్తూ ఉంటాడు . విరాట్ కోహ్లీని సంక్రాంతి కింగ్ అని కూడా ఎంతో మంది అభిమానులు పిలుస్తూ ఉంటారు అని చెప్పాలి.
ఇప్పుడు వరకు విరాట్ కోహ్లీ తన కెరియర్లో సరిగ్గా సంక్రాంతి రోజునే నాలుగు సెంచరీలు చేశాడు అని చెప్పాలి. 2017 లో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్లో 122 పరుగులతో చెలరేగిపోయిన విరాట్ కోహ్లీ.. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 153 పరుగులు చేసి అదరగొట్టాడు. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో 109 పరుగులు చేసి మరో సెంచరీ తో చెలరేగిపోయాడు. ఇక ఇటీవల సంక్రాంతి రోజున శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో కూడా 166 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇలా సంక్రాంతి వచ్చిందంటే చాలు కోహ్లీ తన బ్యాటింగ్ తో పూనకాలు తెప్పిస్తూ ఉంటాడని అభిమానులు భావిస్తూ ఉన్నారు.