ఇటీవల కాలంలో భారత క్రికెట్లో తన ప్రదర్శనతో హాట్ టాపిక్ గా మారిపోతున్న సూర్య కుమార్ యాదవ్ ఇక తన మంచి మనసుతో కూడా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు అని చెప్పాలి. భారత్ శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భాగంగా సూర్యకుమార్ చేసిన పని ప్రస్తుతం క్రికెట్ అభిమానులు అందరిని కూడా ఫిదా చేసేస్తుంది అని చెప్పాలి. ఇటీవల జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో భారత జట్టు విజయం సాధించింది. తద్వారా వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి 3-0 తేడాతో ఇక ప్రత్యర్థి శ్రీలంకను క్లీన్ స్వీప్ చేసింది అని చెప్పాలి.
ఇక ఈ మ్యాచ్ లో శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సూర్య కుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి ఫాన్స్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. స్టేడియంలో ఉన్న అభిమానులు సంజూ ఎక్కడ అంటూ సూర్యకుమార్ను ప్రశ్నించారు. కాసేపటి వరకు అభిమానుల అరుపులు పట్టించుకోని సూర్య కుమార్.. ఆ తర్వాత ఇక వారి ప్రశ్నకు స్పందించాడు. ఏం చెబుతున్నారు అన్నట్లుగా మళ్లీ అడిగాడు సంజు ఎక్కడ అంటూ ఫ్యాన్స్ ప్రశ్నించగా.. నా హృదయంలో ఉన్నాడు అంటూ సింబల్ చూపించడంతో ఫాన్స్ ఫిదా అయిపోయారు అని చెప్పాలి.